HomeTelanganaCpm National General Secretary Sitaram Yechury Ignoring The President To Inaugurate The New Parliament Building Is An Unconstitutional Act
‘రాష్ట్రపతిని విస్మరించటం రాజ్యాంగ వ్యతిరేకం’
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని విస్మరించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని విస్మరించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 79లో పార్లమెంటులోని ఉభయసభలను నడిపించేది రాష్ట్రపతే అని స్పష్టంగా రాసుకున్నామని ఆయన వివరించారు. ప్రధాని పార్లమెంటుకు కూడా నాయకుడు కాదని, అధికార పార్టీకి మాత్రమే నాయకుడనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉండాల్సిందేనని పేర్కొన్నారు.