కోల్సిటీ, మే 18: మోదీని గద్దె దించేదాకా తమ పోరాట ఆగదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి దేశంలో ఇల్లులేని పేదలు లేకుండా చేస్తానని నమ్మించి మోదీ మోసం చేశారని మండిపడ్డారు. కర్ణాటకలో సామాన్య ఓటర్లు గట్టి దెబ్బకొడితే మోదీ దిమ్మ తిరిగిపోయిందని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇచ్చేదాకా తమ పోరాటం ఆగదని చెప్పారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో పది లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.