హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): అమిత్ షా కేంద్రమంత్రిలా కాకుండా ఓ ముఠానాయకుడిలా తెలంగాణకు వచ్చినట్టుందని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోమనే తరహాలో ప్రసంగించటమే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
హైదరాబాద్ మగ్ధూంభవన్లో సోమవారం సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమస్యలు, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి చెప్పకుండా బండి సంజయ్ ని అరెస్టు చేస్తే తన కు నిద్ర కూడా పట్టలేదని మాట్లాడటం హాస్యాస్పదమన్నా రు. తాము అధికారంలోకి వస్తే ము స్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారని, రాష్ట్రంలో ముస్లింలకు వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారేగానీ, మతం ఆధారంగా కాదన్న సోయి లేదని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామ ని అమిత్షా వ్యాఖ్యానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ దుయ్యబట్టారు.