హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వివేకానంద స్ఫూర్తితో.. భగత్సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ సమావేశాలు హైదరాబాద్ లో కొనసాగుతుండగా, సోమవారం కూనంనేని, చాడ వెంకట్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై, మాట్లాడారు.
నేటి యువత హేతుబద్ధమైన ఆలోచనలు చేయాలని, నిరంత రం అధ్యయనం చేయడం ద్వారా దేశ సమసమాజ స్థాపనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు. మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని వీడాలని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ డిమాండ్ చేశారు. విభజన రాజకీయాలను కట్టిపెట్టి వెంటనే ఆ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాలని కోరారు.