కరీంనగర్ తెలంగాణచౌక్, జూలై 9: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ వరంగల్ పర్యటనకు వ చ్చారని ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకుండా రాష్ట్ర పర్యటనకు ఎలా వచ్చారని ప్ర శ్నించారు. విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రధానిదేనని డిమాండ్ చేశారు. రూ.20 వేల కోట్లతో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఇక్కడి 10 వేల మంది యువతకు ఉపాధి లభించేదని పేర్కొన్నా రు. కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ దురుద్దేశంతోనే గుజరాత్కు తరలించారని మండిపడ్డా రు. రూ.500 కోట్లతో పనులు ప్రా రంభమై నడుస్తున్న వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని అభివృద్థి పేరుతో ప్రధాని ప్రారంభించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను అభివృద్థి పనుల పేరిట మభ్యపెట్టడానికే రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న మోదీ తెలంగాణకు ఈ తొమిదేండ్లలో ఎన్ని కోట్లు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.