తాండూర్, ఏప్రిల్ 18: దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం పెట్టుబడిదారులకు మేలు చేసేందుకే మోదీ శ్రమిస్తున్నారని దుయ్యబట్టారు. అదాని, అంబాని సహా 30 మంది దొంగలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులకు సంబంధించి రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అదే సమయంలో సామాన్యుడికి అందకుండా చెప్పులకు జీఎస్టీ వేసిన ఘనత మోదీకే దక్కుతుందని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన మోదీ బొగ్గు బ్లాకులను వేలం వేయడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ అబద్ధాల కోరని, ఇంతకు మించిన సాక్ష్యం ఏమి కావాలన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో 24 మంది రేపిస్టులు, దొంగలు, హంతకులు ఉన్నారని దుయ్యబట్టారు. 1.50 లక్షల కోట్ల బడ్జెట్ నుంచి కేవలం రూ.60 వేల కోట్లకు ఉ పాధి హామీని కుదించడం మోదీ పనితనానికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీపై పోరాటానికి బీఆర్ఎస్ అన్ని శక్తులను కలుపుకొని పోవాలని, అప్పుడే బీజేపీని గద్దె దించడం సాధ్యం అవుతుందని అన్నారు.