హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఇలాంటి ముఖ్యమైన నివేదికలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.
అసెంబ్లీలో మాట్లాడుతూ తప్పులు చేసిన తర్వాత ఎంత సర్దిచెప్పుకొన్నా అది పనికిరాదని పేర్కొన్నారు. అప్పులు చేయడం తప్పుకాదని, అప్పుల పేరుతో రాష్ట్రం పరువు పోకుండా చూడాలని కోరారు.