వరంగల్ : తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అహంకారం బయట పడిందన్నారు. తెలంగాణ ప్రజలను బీజేపీ నాయకులు సెకండరీ గ్రేట్ సిటిజెన్స్గా చూస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంపై కానీ, ప్రజల మనోభావాలపై బీజేపీ నాయకులకు గౌరవం లేకుండా పోతుందన్నారు. గోయల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు.