హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. దేశంలో జరిగే అవినీతి మూలాలు ప్రధాని మోదీ మెదడులోనే ఉ న్నాయని విమర్శించారు. అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడం వల్ల ఎల్ఐసీకి రూ. 40 వేల కోట్లు, ఎస్బీఐకి రూ.9 వేల కోట్లు, ఇతర బ్యాంకులకు వేలా ది కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ప్రధాని మోదీ తక్షణమే అదానీ కంపెనీలపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అవినీతిపరుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని కోరారు.