హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను మరిచారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్నగర్లో జరిగిన సీపీఐ నిరసనలో శ్రేణులనుద్దేశించి చాడ మాట్లాడారు. ఎనిమిదేండ్ల కాలంలో ప్రధాని తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. రాష్ర్టానికి బయ్యారం ఉకు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, గిరిజన, మైనింగ్ యూనివర్సీటీలను ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలు సాధించేదాకా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
హిమాయత్నగర్లో ఉద్రిక్తత
సీపీఐ నిరసన సమయంలో ఉద్రిక్తత నెలకొన్నది. మోదీ హటావో-దేశ్ బచావ్, మోదీ గో బ్యాక్, నిరంకుశ మోదీ నశించాలి, విభజన హామీలు అమలు చేయాలి.. అంటూ సీపీఐ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. హిమాయత్నగర్ ప్రధాన రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ సమయంలో తీవ్ర తోపులాట చోటుచేసుకున్నది. పోలీసులు సీపీఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకురాలు పీ ప్రేమ్పావని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బీ స్టాలిన్, వీఎస్ బోస్, బీ వెంకటేశం, జీ చంద్రమోహన్గౌడ్, పడాల నళిని, నిర్లేకంటి శ్రీకాంత్, ఆర్ మల్లేశ్, షంషుద్దీన్, ఆరుట్ల రాజ్కుమార్, ఆర్ బాలకృష్ణ, చైతన్యయాదవ్, ఒమర్ఖాన్, లతీఫ్, ఆరిఫ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు నాగయ్య, డీజీ నర్సింహారావు, ఎం శ్రీనివాస్రెడ్డి, జ్యోతి, స్కైలాబ్బాబు తదితరులు పాల్గొన్నారు.