యాదాద్రి భువనగిరి : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీస్ అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా భాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా గుండాల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ముందుగా అధికారులతో కలిసి స్టేషన్, సిబ్బంది గృహసముదాయ నివాసాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్ రిసెప్షన్ విభాగం, ఐటీ విభాగం పనీతీరును అడిగి తెలుసుకున్నారు.
నేరాల నియంత్రణ గురించి తీసుకుంటున్న చర్యలపై సీపీ ఎస్.ఐ తిరుపతిని అడిగితెలుసుకున్నారు. సిబ్బందిని వ్యక్తిగతంగా శాఖపరమైన సమస్యలను అడిగితెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మనం నిర్వహించే విధులతోనే ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రముంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఘన్ పూర్ ఏఎస్పీ అభినవ్ గైక్వాడ్, జనగాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే