హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కింగ్కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్ వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. 34 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్లో దాదాపు 100శాతం మందికి.. జీహెచ్ఎంసీలో 90శాతం మందికి కనీసం ఓ డోస్ పూర్తి చేశామని చెప్పారు.