హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపుచేసింది. శుక్రవారం ఒక్కరోజే 1,11,726 మందికి టెస్టులు నిర్వహించగా, 2,909 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 487, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 289, రంగారెడ్డిలో 225, నిజామాబాద్లో 202, జగిత్యాలలో 121, సంగారెడ్డిలో 117, నిర్మల్లో 131, కామారెడ్డిలో 102, మహబూబ్నగర్లో 93, కరీంనగర్లో 92, నల్లగొండలో 89, వరంగల్ అర్బన్లో 86, సిద్దిపేటలో 82, ఖమ్మంలో 66, వికారాబాద్లో 60, యాదాద్రి భువనగిరిలో 53, వనపర్తిలో 52 కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం 17,791 మంది దవాఖానలు, ఇండ్లల్లో చికిత్స పొందుతున్నారు.
ఎస్ఈసీ పార్థసారథికి వైరస్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి స్వల్ప అస్వస్థతకు గురవడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ అని వచ్చింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
1.8 లక్షల మందికి తొలిడోస్
రెండో దఫా వ్యాక్సినేషన్లో భాగంగా శుక్రవారం 1,08,557 మందికి తొలిడోస్ వేశారు. 7,245 మందికి రెండోడోస్ వేశారు. దీంతో తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 16.08 లక్షలకు చేరగా, రెండుడోసులు తీసుకున్నవారి సంఖ్య 2.90 లక్షలకు చేరింది.