మొక్కలు నాటిన ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి దంపతులు
హైదరాబాద్, మార్చి 27 : మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన వ్యవసాయ క్షేత్రంలో శేరి సుభాష్రెడ్డి దంపతులు పారిజాతం మొక్కలను నాటారు. పచ్చటి ప్రకృతి చండీమాతకు అత్యంత ప్రీతిపాత్రమని, మొక్కలను మహావృక్షాలుగా మార్చి అమ్మవారి దయకు పాత్రులయ్యే విధంగా ప్రతి ఒక్కరూ అవకాశమున్న చోట మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.