Raja Singh | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఆ పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ ఆ దివారం సెటైర్లు వేశారు. బండి సంజ య్, ఈటల కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా..? అని పార్టీ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. వారి మధ్య సమస్యలు ఉండవచ్చని, పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు.
గ్రేటర్ హైదరాబాద్లో మూడు కార్పొరేషన్లు గెలుస్తామని చెబుతున్నారని, ఒక్క కార్పొరేషన్లో సగం సీట్లయినా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. బీజేపీలో కొందరికి అధ్యక్ష పదవి దక్కకుండా చేసేందుకే రాంచందర్రావును కూర్చొబెట్టారని పేర్కొన్నారు. రాంచందర్రావు చేతులు కట్టేసి పని చేయమం టే ఎట్లా..? అంటూ ప్రశ్నించారు. రాం చందర్రావు ఎంత బాధలో ఉన్నారో తెలుసని, ఒకరు చెప్పినట్టు పని చేయాలంటే ఎలా చేస్తారంటూ పరోక్షంగా కిషన్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.