హైదరాబాద్: నగర శివార్లలోని సూరారం చెరువు కట్టపై పెను ప్రమాదం (accident) తప్పింది. ఓ కంటైనర్లో ఉన్న విద్యుత్ సామాగ్రి పక్కనే వెళ్తున్న కారుపై పడింది. అయితే అందులో ఉన్న దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం చెరువు కట్టపై విద్యుత్ సామాగ్రి లోడుతో ఉన్న ఓ కంటైనర్ వేగంగా దూసుకెళ్తున్నది.
అయితే కంటెయినర్లో ఉన్న లోడు ఒక్కసారిగా దానిపైనుంచి జారి పక్కనే వస్తున్న కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమయింది. అందులో ఉన్న దంపతులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.