సిద్దిపేట : హైదరాబాద్లో జరిగిన కూతురి బర్త్డే వేడుకల్లో పాల్గొని ఆనందంగా వెనుతిరిగిన ఆ దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ పట్టణం సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించారు.
మృతులను గజ్వేల్కు చెందిన జగ్గయ్యగారి శ్రీధర్ (42), లత (40)గా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారిపై వెళుతుండగా ప్రజ్ఞాపూర్ వద్ద స్టీరింగ్పై శ్రీధర్ పట్టు కోల్పోవడంతో కారు రోడ్డు డివైడర్ను ఢీకొంది. ఆపై కారు అవతలి వైపుకు ఎగిరి మరో కారుపై పడింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మరణించారు.
గజ్వేల్లో కిరాణ దుకాణం నిర్వహించే శ్రీధర్ కూతురి బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు బుధవారం షాపు మూసివేశాడు. శ్రీధర్ దంపతుల కూతురు హైదరాబాద్లోని కాలేజ్లో చదువుతోంది. గురువారం ఉదయం వారు గజ్వేల్కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.