వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలోని వీర్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నది. వీర్నపల్లి చెందిన పాశం లక్ష్మీ, మల్లయ్య భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంట్లోవాళ్లు కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.
కాగా, బుధవారం తెల్లవారుజామున దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించి కుటుంబ సభ్యులు వారిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దావఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మల్లయ్య (70) మృతి చెందగా, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.