హైదరాబాద్ : మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000 ఆదాయం రాగా.. అధికారులు బ్యాంకులో జమ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు కోటి మందికిపైగా తరలించారు.