జమ్మికుంట/పెద్దపల్లి నవంబర్ 14: పత్తి ధర రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. జమ్మికుంట కాటన్ మార్కెట్ యార్డులో క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.9,150 పలికింది. జమ్మికుంట కాటన్ మార్కెట్కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల విడి పత్తి వచ్చింది.
గరిష్ఠ ధర రూ.9,150, మధ్యస్థ ధర రూ.9వేలు, కనిష్ఠ ధర రూ.8వేలుగా ఉంది. అలాగే, 107 క్వింటాళ్ల బస్తాల్లో కాటన్ రాగా, గరిష్ఠ ధర రూ.8,800, మధ్యస్థ ధర రూ.8,500, కనిష్ఠ ధర రూ.6 వేలతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. కాగా, పెద్దపల్లి ఏఎంసీలో క్వింటాల్ పత్తి ధర రూ.9016 పలికింది.