Telangana | ‘దోస్తుతో బంధం’పై బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ ప్రధాని మోదీని బోనులో నిలబెడితే, ‘అవినీతిపరులంతా ఒక్కటయ్యార’ని మోదీ ఎకసెక్కాలాడారు. కానీ బీఆర్ఎస్పై అవినీతి మచ్చలేదనీ, నీతిమంతమైన పాలనలో కేసీఆర్- తెలంగాణ ముందున్నదని లోక్నీతి సర్వేలో ఓటర్లు తేల్చిచెప్పారు. నోరూవాయీ లేని రాష్ట్ర విపక్ష నేతలు ఏం ఒర్రినా ప్రజలు పట్టించు కోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు; నీతిమంతమైన బాధ్యతాయుత పాలనలోనూ బీఆర్ఎస్కు బీఆర్ఎస్సే సాటి!
అవినీతి అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ.
క్రితం కంటే అవినీతి తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఇది కోట్లాది ఓటర్ల మనోగతం. లోక్నీతి సంస్థకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అధ్యయనంలో తేలిన సత్యమిది. దేశవ్యాప్తంగా (గత నాలుగేండ్లుగా ఎన్నికలు జరిగిన) 13 రాష్ర్టాల్లో లక్షలాది ఓటర్లతో జరిపిన సర్వేలో బయటపడిన నిజమిది. ఈ సర్వే ఫలితాలను ‘మింట్’ పత్రిక గురువారం సంచికలో ప్రచురించింది. ‘అవినీతి- ఎన్నికల ఫలితాలు- అధికార పక్షాల మార్పు’ అనే థీమ్ ఆధారంగా… 2018 నుంచి 2022 దాకా, 13 రాష్ర్టాల్లో ఈ సర్వే జరపగా… మిగతా 12 రాష్ర్టాలకన్నా అవినీతి సూచీలో తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఆ 12 రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలోనే అవినీతి అతి తక్కువగా ఉన్నట్టు ఇది స్పష్టం చేసింది. అంతేకాదు; అంతకుముందు కన్నా, రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో అవినీతి తగ్గుముఖం పట్టినట్టుగా కూడా ఓటర్లు అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొన్నది.
ఎనిమిదిన్నరేండ్ల పసి రాష్ట్రం తెలంగాణ, కేసీఆర్ సారథ్యంలో, నిజ రుజు మార్గంలో ఎలా పురోగమిస్తున్నదో చెప్పే అద్భుత ప్రమాణమిది. తెలంగాణ ప్రజల కోసం ‘కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తున్నం ’ అని కేసీఆర్ పదేపదే చెప్తున్న మాటకు ప్రత్యక్ష తార్కాణమిది. సాంకేతికత సాయంతో, నేరుగా నగదు బదిలీతో సృజనాత్మకంగా పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు నిజాయతీకి దక్కిన గౌరవమిది.
కేంద్రంలోని మోదీ సర్కారు తప్పక అమలు చేయాల్సి వస్తే.. తెలంగాణ పథకాలే కాపీ!
బీజేపీ తన రాష్ర్టాల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి.. తెలంగాణ పథకాలే కాపీ!
యూపీ రైతు కోసమైనా, మహారాష్ట్ర రైతు కోసమైనా.. తెలంగాణ పథకాలే కాపీ!
కర్ణాటకే కాదు; ఈ రోజు ఏరాష్ట్రంలో ఏపార్టీ మ్యానిఫెస్టో చూసినా.. తెలంగాణ పథకాలే కాపీ!
పేదలు, రైతుల గురించి ఎవరు ఏం చేయదలచినా.. కనిపించేది తెలంగాణ నమూనాయే!
అందుకే రైతుబంధును కేంద్రం అమలు చేస్తున్నది.. అరకొరగానైనా! కేసీఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టగానే అక్కడి బీజేపీ ప్రభుత్వం రైతుకు 6 వేల సాయం ప్రకటించింది. కంటి వెలుగు సూపర్ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏకంగా అమలునే ప్రకటించారు. మన జల సంరక్షణను పంజాబ్ సీఎం భగవంత్మాన్ పరిశీలించి వెళ్లారు. ఇంటింటికీ భగీరథ నీళ్లు అన్ని రాష్ర్టాలకూ తారక మంత్రమైంది. ఒకటా రెండా.. ఇలా అనేక పథకాలు.. అందరికీ ఆదర్శంగా! ‘అనంతగిరీకీ హవా.. సబ్ బీమారియోంకా దవా’ అన్నట్టు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు సమస్యలకు పరిష్కారం తెలంగాణ మాడల్!
మహారాష్ట్ర షేత్కరీ సంఘటన నాయకుడు
సుధీర్ సుధాకర్ బిందు మాటల్లో చెప్పాలంటే…
అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లో కేసీఆర్ గురించే చర్చ!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో అవినీతి తక్కువగా ఉన్నదని ఓ సర్వే తెలిపింది. 2018-2022 మధ్య 13 రాష్ర్టాల్లో ఈ సర్వే నిర్వహించగా, జాబితాలో తెలంగాణ అట్టడుగున ఉండి అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా నిలిచింది. క్రితం ఎన్నికలతో పోలిస్తే, అవినీతి తగ్గుముఖం పట్టిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్టు సర్వే తేల్చిచెప్పింది. ‘అవినీతి-ఎన్నికలపై దాని ప్రభావం’ అనే అంశంపై ‘లోక్నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ (సీఎస్డీఎస్) 2018 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 13 రాష్ర్టాల్లో సర్వే నిర్వహించింది. సర్వే వివరాలను ఆంగ్ల పత్రిక ‘మింట్’ గురువారం ప్రచురించింది. 12 రాష్ర్టాల్లో అవినీతి పెరిగిపోయిందని సర్వేలో పాల్గొన్న ఓటర్లు చెప్పగా, తెలంగాణ లో మాత్రమే అవినీతి తగ్గిందని పేర్కొన్నారు. అవినీతి పెచ్చరిల్లిన ఆరు రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. తెలంగాణలో అవినీతి తగ్గటంవల్లే.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి 2018 ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయాన్ని అందించారని సర్వే వెల్లడించింది.
రానున్న 2024 లోక్సభ ఎన్నికల్లో అవినీతితోపాటు అభివృద్ధి, నిరుద్యోగం, ఆర్థికప్రగతి, ద్రవ్యోల్బణం తదితర సమస్యలు స్పష్టమైన ప్ర భావం చూపవచ్చని సర్వే అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో ద్రవ్యోల్బణం, అవినీతి అం శాలు ఓటర్లకు ప్రధాన సమస్యగా కనిపించా యి. అవినీతి స్థాయిని విశ్లేషించి ఓటేస్తామని 15 శాతం మంది, ద్రవ్యోల్బణ స్థాయిని అంచనావేసి ఓటేస్తామని 26 శాతం మంది ఓటర్లు సర్వేలో చెప్పారు. 2019 ఎన్నికల్లో 3 శాతం మంది ఓటర్లే అవినీతిని తమ ఓటుకు ప్రాధాన్యంగా ఎంచుకొన్నారు. అందువల్లే రాఫెల్ కుంభకోణంపై అధికార బీజేపీని విపక్ష కాంగ్రెస్ ఇరుకున పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కంపెనీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీని నిలదీయడం, కర్ణాటకలో విరూపాక్షప్ప వంటి బీజేపీ నేతల ఇండ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్న తీరు అవినీతికి పరాకాష్ఠగానే మిగులుతున్నది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో అవినీతి అంశం ఫలితాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి.
1989, 2014 లోక్సభ ఎన్నికల్లో అవినీతి అంశం కీలకంగా మారడంతోనే అప్పుడు కేం ద్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారాన్ని చేపట్టాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ‘40 శాతం కమీషన్ రాజ్’ ఉదంతాలు సంచలనంగా మారాయి. యూపీలో ఉ పాధి కూలీల డబ్బుల్లో గోల్మాల్, ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పలు ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, గోవా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లోనూ అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వెరసి డబుల్ ఇం జిన్ ప్రభుత్వాలు అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. తాజా సర్వేలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అవినీతి పెరిగిపోయిందని ఓటర్లు పేర్కొన్నారు.
అవినీతితోపాటు మరికొన్ని సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని సర్వేలో ఓటర్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తమకు ప్రాధాన్యంగా కనిపిస్తున్నట్టు 8 రాష్ర్టాల ప్రజలు పేర్కొనగా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని మిగతా నాలుగు రాష్ర్టాల్లోని ప్రజలు సర్వేలో అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో టాప్-5 సమస్యల్లో అవినీతి ఒకటిగా నిలిచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో అవినీతి ప్రధాన సమస్య అని 5 శాతం మంది ఓటర్లు పేర్కొనగా, ఛత్తీస్గఢ్లో 6 శాతం, జార్ఖండ్లో 7 శాతం మంది ఓటర్లు కరప్షన్ తమ రాష్ర్టాభివృద్ధికి సమస్యగా మారినట్టు వెల్లడించారు.