డీఎంహెచ్వో కృష్ణ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 25: జిల్లాలో మలేరియాను పూర్తిగా నిర్ములించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. మలేరియాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా ప్రభావం వల్ల కొవిడ్ నిబంధనల ప్రకారం ర్యాలీలు, మీటింగ్లు కాకుండా సోషల్ మీడియా, ఇతర సమాచార మాధ్యమాలతో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారిని అభినందించారు. మలేరియా, డెంగీ, చికున్గన్యా, మెదడువాపు, బోధకాలు, టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధుల ను నియంత్రించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి జేడీ విజయ్కుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్లో నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్లో పనిచేస్తున్న కార్మికుల్లో మలేరియా కేసులు నమోదువుతున్నాయన్నారు. కార్మికులందరికీ రక్తనమూనాలు సేకరించి కేసులను గుర్తించామన్నారు. కార్యక్రమంలో ఏవో నర్సింహారెడ్డి, హెల్త్ ఎ డ్యుకేటర్లు నాగరాజ్, సీహెచ్వో అంబరీశ్, రమేశ్, సుభాష్చంద్రబోస్, శ్రీనివాస్, జానకీరాం,రమణ, కిరణ్ పాల్గ్గొన్నారు.