నల్లగొండ : కరోనా బారిన పడి దవాఖానల్లో లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తున్న క్రమంలో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాధ్ జిల్లా పోలీసు అధికారుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు. కరోనా బారిన పడిన వారికి దవాఖానల్లో నగదు రహిత చికిత్స అందించేలా చొరవ తీసుకున్నట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.
కరోనా బారిన పడిన పోలీసులను, వారి కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా జిల్లా పోలీస్ శాఖ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి కరోనా కవచ్ పాలసీని సాధ్యమైన మేర తక్కువ ప్రీమియంతో జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు అధికారి నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నగదు రహిత చికిత్స అందించేలా ప్రీమియం మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు.
ఇందుకోసం జిల్లాలోని 1,417 మంది పోలీస్ అధికారుల కోసం 27 లక్షల 73 వేల 257 రూపాయలను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించినట్లు ఆమె వివరించారు.
పోలీస్ అధికారులు, సిబ్బందికి కరోనా సోకితే మూడు లక్షల రూపాయల వరకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా నగదు రహిత కరోనా చికిత్స అందించేలా ఈ కరోనా కవచ్ పాలసీ కోసం అన్ని స్థాయిల పోలీస్ అధికారుల అంగీకారం తీసుకున్న అనంతరం ప్రీమియం చెల్లించడం జరిగిందన్నారు.
దీని కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా అందరు సిబ్బంది పాలసీ పట్ల తమ అంగీకారాన్ని తెలుపుతూ సంతకాలు చేసిన అంగీకార పత్రాల ఆధారంగా పాలసీ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పాలసీ కింద జూన్ 25వ తేదీ నుంచి తొమ్మిదిన్నర నెలల కాలం పాటు ఎవరికైనా కరోనా సోకితే మూడు లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారని ఆమె తెలిపారు.
ఈ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని జూన్ నెల చెల్లించే వేతనం నుంచి ఆయా అధికారుల వయస్సు, వారి ప్రీమియంకు అనుగుణంగా మినహా ఇస్తారని తెలిపారు.
ఎస్పీ రంగనాధ్ చొరవతో..
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం పట్ల నిరంతరం శ్రద్ధ వహించే ఎస్పీ రంగనాధ్ కరోనా విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి తక్కువ ప్రీమియంతో అమలు చేసేలా కృషి చేశారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల