మహబూబ్నగర్ : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానను సందర్శించారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించే విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న రోగులతో మంత్రి మాట్లాడారు. చికిత్స ఎలా ఉందని ?డాక్టర్లు బాగా చూసుకున్నారా? భోజనం ఇతర వసతులు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాలోని పేషెంట్లను ఆ జిల్లాలోనే చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో గత సంవత్సరమే సుమారు 300 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల్లో మరో 250 పడకల ను పూర్తి ఆక్సిజన్ తో సహా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
జిల్లాలో మూడు సంచార అంబులెన్స్ క్లినిక్ లను కరోనా కోసం ఏర్పాటు చేశామన్నారు.
వాటి ద్వారా మందులను ఇంటికే పంపిస్తామన్నారు. భయపడకుండా ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా దవాఖానతో పాటు,ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలో కూడా బెడ్లు ఇతర సౌకర్యాలున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
మంత్రి వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత