హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల త్వరలోనే కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కానున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్టు తెలిసింది.
ఏఐసీసీకి ప్రధాన కార్యదర్శిగా కూడా షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో అధికారపార్టీ వైఎస్సార్సీపీపై దూకుడు పెంచారు.