హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ బుక్లెట్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐటీ శాఖ మం త్రి శ్రీధర్బాబు తెలిపారు. గురువారం గాంధీభవన్లో మంత్రి సీతక్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 25 రోజులు కూడా కాలేదని, హామీల అమలుపై తగిన సూచనలు సలహాలు ఉంటే ఇవ్వాలని చెప్పారు. 420 ఎవరో? డబుల్ 420 ఎవరో? ప్రజలకు తెలుసన్నారు.