Priyanka Gandhi | తెలంగాణ ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఫేక్ సర్వేలు, గాలి మాటలతో మైండ్గేమ్ ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న విజయబేరి సభలకు ప్రజలు ముఖం చాటేస్తుండటం హస్తం నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావుఠాక్రే.. నేడు సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరైన సభలకు జనం లేకపోవడంతో ఆ పార్టీ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పరువు నిలుపుకొనే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పార్టీవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం పలు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహించారు. ఈ సభలకు రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, మరికొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరయ్యారు. ఇందులో ఏ ఒక్క సభలోనూ పట్టుమని పిడికెడు జనం కనిపించలేదు. ప్రియాంకగాంధీ పాల్గొన్న హుస్నాబాద్ సభకు 30 వేల మంది వస్తారని ఆ పార్టీ అంచనా వేయగా.. కేవలం 5వేల మందే వచ్చారు. వారు కూడా ఆమె ప్రసంగిస్తుండగానే జారుకున్నారు. నాయకులు జనాన్ని బతిమిలాడుకున్నా ఒక్కరూ వినలేదు.
కొందరు నాయకులు, కార్యకర్తలే మిగలగా.. ఖాళీ కుర్చీలను చూస్తూ ఆమె ప్రసంగించా రు. ప్రియాంకగాంధీ పాల్గొన్న పాలకుర్తి సభకూడా జనం లేక వెలవెలబోయింది. పాలకుర్తి నియోజకవర్గ సభను తొర్రూరు పట్టణంలో నిర్వహించగా… ప్రియాంకగాంధీ వేదిక పైకి వచ్చేసరికే జనం ఇంటిబాటపట్టారు. ప్రియాంకగాంధీ ప్రసంగం ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత సభా ప్రాంగణంలో సగానికిపైగా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం లేకపోవడంతో ప్రియాంక అసహనంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది.
కాంగ్రెస్ నేతలపై ప్రియాంక ఆగ్రహం
రెండు సభల్లోనూ ఖాళీకుర్చీలే దర్శనమివ్వడం తో ప్రియాంకగాంధీ తీవ్ర అసహనానికి గురైనట్టు తెలిసింది. తాను వస్తున్నానని తెలిసికూడా జనాన్ని ఎందుకు సమీకరించలేదని స్థానిక నేతలపై మండిపడ్డట్టు సమాచారం. సభలకే జనాలను తరలించలేని వారు.. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఎలా కాంగ్రెస్ వైపు మళ్లిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రజలను తరలించే శక్తి లేనప్పుడు తననెందుకు ఆహ్వానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
రేవంత్ సభలకూ స్పందన కరువు
టీపీసీసీ చీఫ్ రేవంత్ పాల్గొన్న నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు సభలు అట్టర్ఫ్లాప్ అయ్యాయి. ఏ ఒక్క సభలోనూ ఆ పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజలు కనిపించకపోవడం గమనార్హం. రేవంత్ వేదికపైకి వచ్చేసరికి పిడికెడు మందే మిగిలారు. ఆయన ప్రసంగం విని నచ్చక మిగతామందికూడా ఇంటిబాట పట్టారు. దీంతో అన్ని సభల్లోనూ 80శాతం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఉన్న కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను చూస్తూ రేవంత్ పసలేని ప్రసంగం చేసి, వెనుదిరిగారు.
రేవంత్రెడ్డి హెలికాప్టర్లో ఉమ్మడి నల్లగొండ జి ల్లాలోని నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పా ల్గొనాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం పరిస్థితి లో ఆయన పర్యటన రద్దు కావచ్చని భావించారు. తన కు ఆది నుంచి పార్టీలో వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్న ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లా కావడంతో ఎలాగైనా సరే సభల పేరుతో నల్లగొండలో పర్యటించాలని రేవంత్ చాలెంజ్గా తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. అందుకే రోడ్డుమార్గాన బయలుదేరి వచ్చారు. ఇంతకష్టపడి వస్తే సభ ల్లో జనాలే కనిపించక రేవంత్ షాక్ తిన్నారు.
కాంగ్రెస్ ఖేల్ ఖతం!
కాంగ్రెస్ మొదటినుంచీ తమకు తెలంగాణలో జనబలం ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నది. ఇందుకోసం చిన్న మైదానాల్లో సభపెట్టి పెద్దసంఖ్యలో జనం వచ్చినట్టు చూపించాలని ప్లాన్ వేసింది. మొదట రెండు, మూడు సభలకు మోస్తరుగా వచ్చిన జనం.. ఆ తర్వాత అన్ని సభలకూ ముఖం చాటేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చినా జనం నుంచి స్పందన కరువైంది. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా ఎక్కడచూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడిపోయారు. ఈ సభలను చూస్తుంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం అయ్యిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వారంటీలేని ఆరు గ్యారెంటీలు.. కాంగ్రెస్ నాయకుల గాలిమాటలు విని విసిగివేసారిన జనం ఆ పార్టీని నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభలకే రాని జనం ఆ పార్టీకి ఎలా ఓటేస్తారని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఫేక్ సర్వేలు, గాలి మాటలతో మైండ్గేమ్ ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న విజయభేరి సభలకు ప్రజలు ముఖం చాటేస్తుండటం హస్తం నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావుఠాక్రే.. నేడు సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హాజరైన సభలకు జనం లేకపోవడంతో ఆ పార్టీ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పరువు నిలుపుకొనే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పార్టీవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
సోనియా ఆశీర్వదిస్తే సీఎం అవుతా ఎన్నికల ప్రచారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల రచ్చ కొనసాగుతూనే ఉన్నది. మరోసారి ఎంపీ, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తను సీఎం కావాలనుకొన్న కోరికను బహిర్గతం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తనకు భారీ మెజార్టీ ఇస్తే పెద్ద స్థానంలో ఉంటానని తన మనసులో మాటను వెల్లడించారు. సోనియాగాంధీ ఆశీర్వదిస్తే తాను ఎప్పుడో ఓసారి నల్లగొండ నుంచి సీఎం అవుతానని ప్రకటించారు. అయితే, తనకు పదవులపై పెద్దగా ఆశ లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఎవరైనా సీఎం కావచ్చని చెప్పారు. ఇప్పటికే పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నానని, పార్టీ సీనియర్ నేతల్లో తాను ఒకరినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో పాటు కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని, సంక్రాంతి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని తెలిపారు. రైతులు తమ పంటను మరో 15 రోజుల వరకు అమ్ముకోవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోనస్తో కొంటామని పేర్కొన్నారు.