కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డిజిట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రజా ఏక్తా పార్టీ దూసుకుపోతోంది. ప్రజా ఏక్తా పార్టీ తరపున సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి పోటీ చేశారు. శ్రీకాంత్కు రోటీ మేకర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. అయితే తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీకి 122 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కాంగ్రెస్కు 220, ప్రజా ఏక్తా పార్టీకి 158 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్లో కాంగ్రెస్కు 107, శ్రీకాంత్కు 43 ఓట్లు వచ్చాయి.