Congress Party | స్టేట్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త సద్దుమణిగాయో లేదో.. అప్పుడే జిల్లా స్థాయి నాయకుల్లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య బహిరంగంగా తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ గాలి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి వ్యాపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే తన్నుకునే స్థాయికి ఆ రెండు జిల్లాల కాంగ్రెస్ రాజకీయాలు చేరుకున్నాయి.
అయితే వరంగల్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజీలో రాహుల్ గాంధీ బహిరంగ సభ వచ్చే నెల మొదటి వారంలో జరగనుంది. ఈ క్రమంలో సభాస్థలిని పరిశీలించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వరంగల్ జిల్లాకు గురువారం చేరుకుంది.
రేవంత్ రెడ్డి బృందం సభాస్థలిని పరిశీలిస్తుండగానే.. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. నాయిని వర్గీయులు జంగా రాఘవరెడ్డి అనుచరులపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి జరిగినప్పుడు జంగా రాఘవరెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి జంగా, నాయిని మధ్య కోల్ద్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.
వరంగల్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. జంగా, నాయిని అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. pic.twitter.com/vknfLdjv8q
— Namasthe Telangana (@ntdailyonline) April 21, 2022