హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ సమీపంలోని తక్కుగూడలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీతోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిసింది. ఇటీవలే ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ఈ సభలో మల్లికార్జున ఖర్గే తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిసింది.