ధారూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరి పాలనలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూరు మండల పరిధిలోని మోమిన్కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రమాదేవి, పీఏసీఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితో పాటు మోమిన్కలాన్, రాజాపూర్, మోమిన్ఖుర్ధు గ్రామాలకు చెందిన 100మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జనరంజక పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. బంగారు తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని అన్ని పార్టీల నంచి భారీగా టీఆర్ఎస్ చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ధారూరు మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజుగుప్త, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, నాయకులు మాణిక్యం, రవికుమార్, రాములు, శ్రీపతిరెడ్డి, రవీందర్ రెడ్డి, మునీర్, తదితరులు పాల్గొన్నారు.