తొర్రూరు, అక్టోబర్ 13 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారి దారం ప్రసాద్ శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రసాద్ అన్నారు.
పార్టీలో ప్రసాద్ కు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు జలగం శ్రీనివాస్, నడిగడ్డ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే రాయపర్తి మండలం బంధన్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పకిడే రతన్ కూడా మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో పర్వతగిరిలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
స్వర్ణకారుల భవన నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తొర్రూరు పట్టణ సునార్ స్వర్ణకారులు తమ మద్దతు ప్రకటించారు. కాగా సునార్ స్వర్ణకారుల కు కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 5 గుంటల స్థలంతో పాటు, రూ.15 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూనార్ స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన గుర్తూరు గ్రామ ఉప సర్పంచ్
తొర్రూరు మండలం గుర్తూరు గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ కు చెందిన ఆవుల సుజాత రవికుమార్, కాంగ్రెస్ గ్రామ ప్రధాన కార్యదర్శి ఈదునూరి మధు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఅర్ ఎస్ పార్టీ లో కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు.