హైదారాబాద్/దేవరుప్పుల, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో హైదరాబాద్ మంత్రుల నివాసంలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వా సావిత్రి, జడ్పీటీసీ పల్ల భార్గవి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకపోతుల నరసింహ గౌడ్, దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, నియోజవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, గ్రామ ఇన్చార్జి జోగు సోమనరసయ్య, మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్, గ్రామ సర్పంచ్ గోపాల్ దాస్ మల్లేష్, ఉప సర్పంచ్ కొండ చిన్న బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇదే సమయంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గారావుల కృష్ణను ఎన్నుకున్నారు.
అలాగే మండలంలోని బంజర గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారిని మంత్రి ఎర్రబెల్లి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గడ్డం పరాంధాము, జీగరి మల్లయ్య, దరావత్ కృష్ణ, దరావత్ బీమా, గాదరి విజయ్ కుమార్, ధరావత్ రమేష్, గడ్డం హరీష్, పట్టూరి శివశంకర్, ధరావత్ రమేష్, ధరావత్ వెంకన్న, ధరావత్ భీమా, మాలోత్ బిక్షపతి, పట్టూరి సాయి, ధరావత్, వెంకటేష్, ధరావత్ తదితరులు ఉన్నారు.