కేతేపల్లి, అక్టోబర్ 13 : సీఎం కేసీఆర్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన 100మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. మూడోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నర్సింగ్ నాగయ్య, టంగుటూరి రవి, టంగుటూరి శ్రీను, బెజవాడ వెంకన్న, బెజవాడ బుచ్చయ్య, నర్సింగ్ భిక్షమయ్య, నర్సింగ్ సైదులు, గరిక వెంకన్న, నర్సింగ్ సతీశ్, రాచకొండ సైదులు, బెజవాడ లింగయ్య, పెద్ది నాగులు, పోగుల నాగయ్య, పుట్ట సైదులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బంటు మహేందర్, బొప్పని సురేశ్, బొజ్జ అరవింద్, సర్పంచ్ గోలి మంజులావేణుమాధవరెడ్డి, ఉపసర్పంచ్ పెరిక ప్రభాకర్ పాల్గొన్నారు.
రామన్నపేట : రామన్నపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గురిజాల మహేశ్రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బత్తుల వెంకటేశం, గ్రామశాఖ అధ్యక్షుడు బుర్రి శ్రీశైలం పాల్గొన్నారు..