Andole |కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మను అందోల్ నియోజకవర్గం లీడర్ను చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది. ఉమ్మడి రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది. మరి, తనకు ఇంత చేసిన అందోల్కు దామోదర చేసింది సున్నా. అందోల్ను అభివృద్ధికి దూరంలో ఉంచిన ఘనతను సొంతం చేసుకున్నారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాక అందోల్ అభివృద్ధిబాట పట్టింది. క్రాంతికిరణ్ ఎమ్మెల్యేగా గెలిచినంక ప్రగతి పనులు స్పీడందుకున్నాయి. ప్రత్యేక నిధులు తెచ్చారు. ఇవాళ అందోల్ అండర్డెవలప్డ్ కాదు. ఆదర్శ నియోజకవర్గం. ఇలా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
అందోల్ నియోజకవర్గం హైదరాబాద్కు సమీపంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం దూరం చేశారు గత పాలకులు. నిండని చెరువులు, పారని కాలువలు, ఎండిన పంటలు, గుంతల రోడ్లు… ఇదీ కేసీఆర్ ప్రభుత్వం రాకముందు అందోల్ పరిస్థితి. గత పాలకులు అందోల్కు కల్పించిన దుస్థితి ఇది. ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన కేసీఆర్కు అందోల్తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. భౌగోళిక పరిస్థితులు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆయన. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అందోల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రతి ఎకరానికీ సాగునీరు అందించాలని సంకల్పించారు. జోగిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో అందోల్లో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తున్నది.
దామోదర రాజనర్సింహ్మ డిప్యూటీ సీఎం హోదాలో పనిచేసినప్పటికీ అందోల్ నియోజవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉన్నది. అదనంగా నిధులు తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నించలేదనే విమర్శలూ ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తానని దామోదర హామీ ఇచ్చారు. ఇందుకోసం చేపట్టిన కాల్వల నిర్మాణ పనుల్లో దామోదర అవినీతికి
పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సింగూరు కాల్వల పనుల్లో నాణ్యత లోపించిన కారణంగా చివరి ఆయకట్టుకు నీరందలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి హరీశ్ రావు స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాల్వలు నిర్మించి 40 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చేశారు.
అందోల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందించాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం తాలెల్మ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. సంగమేశ్వర ఎత్తిపోతల పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకం ద్వారా అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాల్లోని 66 గ్రామాల్లో 65,816 ఎకరాలకు సాగునీరు అందనున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా వట్పల్లి, రేగోడ్ మండలాల్లోని 36 గ్రామాల్లో 34 వేల ఎకరాలకు సాగునీరు చేరనున్నది. మల్లన్నసాగర్ 19వ ప్యాకేజీ ద్వారా అందోల్ నియోజకవర్గంలోని 10,131 ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా సాగునీరు లేక ఇబ్బందులు పడ్డ ఇక్కడి రైతన్నల జీవితాలు మారుతున్నాయి.
☞ రూ.152.48 కోట్లతో మిషన్ కాకతీయ కింద 774 చెరువులను పునరుద్ధరణ.
☞ రూ.132.99 కోట్లతో సింగూరు ప్రాజెక్టు కాల్వల నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తి
☞ మంజీరా నదిపై రూ.3.87 కోట్లతో రెండు చెక్డ్యాంల నిర్మాణం
☞ మినీ ట్యాంక్ బండ్గా అందోల్ చెరువు అభివృద్ధి. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు
☞ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు
☞ 100 పడకల దవాఖాన నిర్మాణం. ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
☞ రూ.100 కోట్లకు పైగా నిధులతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా
☞ రూ.250 కోట్లతో రోడ్లు, భవనాల నిర్మాణం
☞ రూ.3.80 కోట్లతో 19 నూతన పంచాయతీ భవనాల నిర్మాణం
☞ జోగిపేటలోని చారిత్రక క్లాక్టవర్ పునరుద్ధరణ.
☞ 25 రైతు వేదికల నిర్మాణం. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.5 లక్షల వ్యయం
☞ నియోజకవర్గంలో 1350 డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం
☞ మునిపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పూర్తయిన భూసేకరణ ప్రక్రియ.