హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఏ అం శంపై ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేని రాహుల్.. తెలంగాణకు ఏం చేస్తారని, కాం గ్రెస్కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ఎంఐ ఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదని స్పష్టంచేశారు.
రాహుల్ పర్యటన, తాజా రాజకీయ పరిస్థితులపై అసదుద్దీన్ శనివారం జాతీయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని ఆ పార్టీ నేతలను అడిగిన వీడియో క్లిప్పింగ్ను చూశానని, ఏ అంశం పై మాట్లాడాలో కనీస అవగాహన లేకపోతే రాహుల్, ఆయన పార్టీ తెలంగాణకు ఏం ఒరగబెడుతుందని నిలదీశారు. తెలంగాణలో కాం గ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకపోయిందన్నారు. సరూర్నగర్లో ముస్లిం యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.