హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు రెం డురోజులపాటు పొడిగించే అవకాశాలున్నాయి. ఈ నెల 13తో ముగియాల్సిన సమావేశాలు ఆ రోజున మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12న సభ వాయిదా వేసి తిరిగి 14, 15 తేదీల్లో కొనసాగించే అవకాశాలున్నాయ ని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్పై చర్చ, ఆమోదం సోమవారం జరిగే అవకాశాలున్నాయి. బీసీ జన గణన బిల్లు, ద్రవ్య వి నిమయ బిల్లు, నీటిపారుదల ప్రాజెక్టుల పై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఎన్ని రోజులు సమావేశాలను కొనసాగించేది ఆదివారం జరిగే సీఎల్పీ సమావేశంలో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.