హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా బాకీ ఎప్పుడిస్తరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. రైతుభరోసా అమలు విషయంలో రేవంత్ సరార్ పిల్లిమొగ్గలు వేస్తున్నదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పంటకాలానికి ముందుగానే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ అయ్యేదని గుర్తుచేశారు. ఒకసారి రైతుబంధు వేయ డం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేదని తెలిపారు. అధికారంలోకి వచ్చాక రేవంత్రెడ్డి మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.