Telangana | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జూన్ 2వ తేదీ ఉదయం గన్పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
సాయంత్రం ట్యాంక్బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్.. మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ ప్రదర్శన, లేజర్ షో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే స్టాళ్లు, చిన్న పిల్లలకు గేమింగ్ షోలను ఏర్పాటు చేశారు.