KTR | కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాంఠో.. అంటే గల్లీలో దోచుకో.. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉందన్నారు. ఇవాళ రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ 15 రోజుల కిందట మొట్ట మొదటిసారి నిర్దిష్ట ఆరోపణలు చేశారని కేటీఆర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా రాలేదన్నారు. వారం కిందట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో బయటపెట్టారని చెప్పారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ.. సీఎం రేవంత్ రెడ్డి గానీ.. ఈరోజు వరకు ఈ కుంభకోణంపై పెద్దవి విప్పడం లేదని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడుతున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ అంటే స్కీమ్లు.. కాంగ్రెస్ అంటే స్కామ్లు అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కాం..గ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామని గుర్తు చేశారు. గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాంఠో.. అంటే గల్లీలో దోచుకో.. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉందన్నారు. ఇవాళ రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని అన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తికాక.. కొనుగోళ్ల కేంద్రాల వద్ద రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే.. ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టకుండా.. ధాన్యం కుంభకోణంపై దృష్టిపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి పేషీ నుంచి పౌరసరఫరాల డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందని తమకు సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం.. కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. వాళ్లు వీళ్లు కలిసి సీక్రెట్గా దందా చేసి వెయ్యి కోట్లు కుంభకోణం చేశారని ఆరోపిపంచారు.
రాష్ట్రంలో బీ ట్యాక్స్ అని.. ఆర్ ట్యాక్స్ అని.. ఆర్ఆర్ ట్యాక్స్ అని.. యూ ట్యాక్స్ అని ట్యాక్స్ల గురించి వింటున్నామని అన్నారు. ఈ స్కాంలో మాత్రం కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని తమకు సమాచారం ఉందన్నారు. 1.67 కోట్ల మంది మహిళలకు వంద రోజుల్లో నెలకు రూ.2500 ఇస్తామన్నారు.. రాష్ట్రంలో 46 లక్షల మంది వృద్ధులకు 4వేలు పింఛన్లు ఇస్తామన్నారు.. ఆ ఫైలు కదలడం లేదు.. రైతులకు రైతు భరోసా కింద రూ.15వేలు అన్నారు.. ఆ ఫైలు కదలడం లేదు. సంక్షేమ పథకాలపై మాట ఇచ్చిందో.. ప్రజల జేబులు నింపే పని చేతనైతలేదు గానీ.. కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని విమర్శించారు.