KTR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సరారు చరిత్రలోనే అతి తకువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వందరోజుల్లోనే ప్రజానీకానికి ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని అన్నా రు. నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో శనివారం నందినగర్లో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నాగర్కర్నూలు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వందకు వందశాతం గెలవబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని, దాని పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ఇటీవల కొడంగల్లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రిలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సీఎం అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. పరిపాలన చేతకాకపోవడం వల్లే ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సరిగ్గా అమలుచేయని ఈ అసమర్థ ప్రభుత్వానికి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. గత పదేండ్ల కాలంలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఈ రాష్ట్రంలో అసలు స్థానమే లేదని అన్నారు.