హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలో ఈ నెల 5న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. నిరంజన్ ఫిర్యాదుపై వాస్తవ నివేదికను పంపాలని ఈసీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది.
ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన నివేదిక ప్రకా రం కేసీఆర్ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినట్టు తెలుస్తున్నదని దీనిపై గురువారం ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.