హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సీఎంగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించనున్న తొలి బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సభగా దీనికి నామకరణం చేశా రు.
ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. మూడేండ్ల కిందట పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్రెడ్డి తొలిసభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. ఇప్పుడు ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు.