జగదేవ్పూర్, జూలై 24: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం వీరంతా సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి రాగా హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దళిత బాంధవుడని, గతంలో ఏ ప్రభుత్వం చేయని వి ధంగా బడుగు, బలహీన వర్గాలు ముఖ్యం గా దళితులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టు తెలిపారు. దళితబంధు ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలిచిందని అన్నారు.