నల్లగొండ : దామరచర్ల మండలం మంగల్ దుబ్బ తండాలో కృష్ణపట్టే రైతుల చిరకాల స్వప్నం కేశవపురం-కొండ్రపోలు లిఫ్ట్ నిర్మాణ పనులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే 5,875 ఎకరాలకి నీరు అందుతుందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా చిరకాల స్వప్నంగా ఉన్న ఈ లిఫ్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్టికి తీసుకెళ్లామని, వెంటనే సీఎం స్పందించి రూ.75 కోట్ల 93 లక్షల నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్