యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. వాహనదారులకు పలు సూచనలు చేశారు. లాక్డౌన్ పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ పనులు ముగించుకోవాలన్నారు. ప్రజలు లాక్ డౌన్కు సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.