జనగామ : కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారoభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో నేటి నుంచి సూపర్ స్ప్రెడర్స్ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్, అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,03,000, మంది సూపర్ స్ప్రెడర్స్ ను, గుర్తించామని మంత్రి తెలిపారు.
ఈ సూపర్ స్ప్రెడర్స్ లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాలలో ఉచితంగా టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 45 సంవత్సరాల పైబడినవారికి 71 వేల 895 టీకాలు (54,143 మొదటి డోస్, 17,752 రెండో డోస్) కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని మంత్రి వివరాలను వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన టీకాలు సమకూర్చనప్పటికి రాష్ట్రంలోని 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా వ్యాక్సిన్ సేకరించడానికి గ్లోబల్ టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు.
ప్రజలను మహమ్మారి నుంచి కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, మండల ప్రత్యేక అధికారి కొండల్ రెడ్డి, తహసీల్దార్ డి. స్వప్న, ఎంపీడీవో ఉమామహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.