హైదరాబాద్ : ఓ వైపు మండే ఎండలు మరో వైపు వర్షాలతో తెలంగాణలో భిన్నమైన వాతారణం కనిపిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు (ఏప్రిల్ 20-22, 2026 వరకు) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా
ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.