రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా బతుకమ్మ చీరల(Bathukamma sarees) ఆర్డర్లు, పెండింగ్ బకాయిలు రూ.200 కోట్లు వెంటనే విడుదల చేసి.. మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సిరిసిల్ల(Siricilla) అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కాంగ్రెస్ సర్కారు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా నేతన్నల పొట్టగొడుతున్నదని మండిపడ్డారు. నిధులు విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.