పాల్వంచ, మార్చి 17 : ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. పలువురు మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుభరోసా డబ్బులు విడతలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదనారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన మక్కజొన్న, ఎర్రజొన్న తదితర పంటలకు కనీస మద్దతు ధర అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, నాయకులు అమర్లపూడి రాము, బానోత్ ధర్మ, మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ, బైరు వెంకటేశ్వర్లు, బానోత్ వీరు, బాలు, శత్రు, వీరస్వామి, రమణి, సరోజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.